కేయూ విద్యార్థి జేఏసీ గర్జన.. 20 వేల కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్

by Jakkula.Mamatha |

కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ చైర్మన్, బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆరేగంటి నాగరాజు గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

కేయూ విద్యార్థి జేఏసీ గర్జన.. 20 వేల కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్
X

దిశ, హనుమకొండ టౌన్: కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ చైర్మన్, బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆరేగంటి నాగరాజు గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు నిరాశతో ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి నమ్మిన నిరుద్యోగ యువత పట్ల రాష్ట్ర సర్కారు వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని పేర్కొన్నారు. వెంటనే యూత్ డిక్లరేషన్ వెంటనే అమలు చేసి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు విడతల వారీగా విడుదల చేసి నిరుద్యోగ యువతకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అజయ్ సింగ్, సుమన్ రాజ్, నితిన్, సాయి, తదితరులు పాల్గొన్నారు.

Next Story