కొరియా ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన తెలుగు తేజాలు

by Disha Web Desk 13 |
కొరియా ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన తెలుగు తేజాలు
X

దిశ, వెబ్‌డెస్క్: సుంచెయాన్‌లో జరుగుతున్న కొరియా ఓపెన్‌ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలుగు తేజాలు మెరిశాయి. భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు విమెన్స్ సింగిల్స్‌లో, కిడాంబి శ్రీకాంత్ మెన్స్ సింగిల్స్‌లో సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టారు. వారిద్దరూ టైటిల్‌ను సాధించడానికి రెండడుగుల దూరంలో నిలిచారు. క్వార్టర్ ఫైనల్స్‌లో పీవీ సింధు.. థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్బమ్‌రుంగ్ఫాన్‌ను వరుస సెట్లలో ఓడించింది. 21-10, 21-16 తేడాతో విజయాన్ని అందుకుంది. మరో మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్‌లో పోరాడాల్సి వచ్చింది. దక్షిణ కొరియాకే చెందిన సొన్ వాన్ హొ పై గెలవడానికి చెమటోడ్చాడు. 21-12, 18-21, 21-12 తేడాతో విజయం సాధించాడు.


Next Story

Most Viewed