ఉత్కంఠ మ్యాచ్‌లో కోల్‌కతా ఘన విజయం

by Disha Web Desk 19 |
ఉత్కంఠ మ్యాచ్‌లో కోల్‌కతా ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్-2022) ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఘన విజయం సాధించింది. మొదటినుంచి ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌ను కేకేఆర్ సారథి చివరివరకు పోరాడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేసింది. కేకేఆర్ బౌలర్ల దెబ్బకు సీఎస్‌కే బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడను తలపించింది. పిచ్ నుంచి అందుతున్న సహకారాన్ని కేకేఆర్ బౌలర్లు సద్వినియోగం చేసుకున్నారు. బంతులను అద్భుతంగా స్వింగ్ చేస్తూ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. అనంతరం ఛేదనకు దిగిన కేకేఆర్ ఆరు వికెట్ల తేడాతో చైన్నైను ఓడించింది.

Next Story

Most Viewed