డిజిటల్ అరెస్ట్ మోసాలపై కేంద్రం కీలక చర్య.. అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు

by Malleboina Mahesh |

దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న 'డిజిటల్ అరెస్ట్' (Digital Arrest) మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

డిజిటల్ అరెస్ట్ మోసాలపై కేంద్రం కీలక చర్య.. అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న 'డిజిటల్ అరెస్ట్' (Digital Arrest) మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యకు సంబంధించిన అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (MHA) ఆధ్వర్యంలో ఒక అత్యున్నత స్థాయి అంతర్-విభాగాల కమిటీని (High-level Inter-departmental Committee) ఏర్పాటు చేసినట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు నివేదించింది. హోంశాఖ అంతర్గత భద్రతా విభాగం స్పెషల్ సెక్రటరీ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. ఇందులో MeitY, టెలికాం (DoT), విదేశాంగ శాఖ, ఆర్థిక, న్యాయ, వినియోగదారుల వ్యవహారాల శాఖలు, RBI అధికారులతో పాటు CBI, NIA, ఢిల్లీ పోలీసుల ఐజీ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు.

డిజిటల్ అరెస్ట్ కేసులపై సుప్రీంకోర్టు (Supreme Court) సుమోటోగా (Suo Motu) విచారణ చేపట్టిన నేపథ్యంలో, ఈ కమిటీ మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు సమయం కోరింది. కమిటీ సభ్యుల నుంచి పూర్తి స్థాయి వివరాలు సేకరించి, వాటిపై చర్చించి, ఒక సమగ్రమైన నివేదికను కోర్టు ముందు ఉంచేందుకు తమకు ఒక నెల గడువు కావాలని కమిటీ సుప్రీంకోర్టును అభ్యర్థించింది.

Next Story