వీడు తాతేనా.. సొంత మ‌న‌మడిపై అతి కిరాత‌కంగా అత్యాచారం

by Dishanational2 |
వీడు తాతేనా.. సొంత మ‌న‌మడిపై అతి కిరాత‌కంగా అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలకే కాదు బాలురులకు కూడా రక్షణ లేకుండా పోతుంది. కామాంధులు ఆడపిల్లలనే కాకుండా మగపిల్లలను కూడా వదలటం లేదు అనడానికి అనేక సంఘటనలు నిదర్శనం. అయితే ఇలాంటి ఘటనే 2019లో చోటు చేసుకుంది. మనం రోజుకు ఎన్నో ఘటనలు చూస్తూ ఉంటాం.. మైనర్ బాలునిపై అత్యాచారం, నాలుగేళ్ల బాలికపై అత్యాచారం అంటూ. అయితే మూడు సంవత్సరాల క్రితం ఓ మైనర్ బాలునిపై సొంత తాతే అత్యాచారానికి ఒడిగట్టాడు. అల్లారు ముద్దుగా చూసుకొని, అన్ని బుద్ధులు నేర్పించి, మనుమడి అలనా పాలన చూసుకోవాల్సిన ఓ తాత దారుణానికి తెగబడ్డాడు. చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా అతికిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో సంఘటన విషయం తెలుసుకున్న బాలుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. తాతను పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టుకు అప్పజెప్పారు. అయితే ఈ కేసును విచారించిన కేరళ హై కోర్టు నిన్న (సోమవారం) తాత‌ను దోషిగా తెల్చుతూ తీర్పును వెళ్లడించింది. బాలునిపై అత్యాచారం చేసినందుకు గాను పలుసెక్షన్లలో తాతకు 73 ఏళ్ల జైలు శిక్షవిధించింది కోర్టు. ప్రస్తుతం ఈ ఘటన కేరళ రాష్ట్రంలో సంచలనంగా మారింది.



Next Story