కాజీపేట్‌ను రైల్వే డివిజన్‌గా ప్రకటించాలి: రైల్వే ఎంప్లాయిస్ జేఏసీ

by Jakkula.Mamatha |

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కాజీపేటకు వెంటనే రైల్వే డివిజన్ ప్రకటించాలని తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జేఏసీ డిమాండ్ చేసింది.

కాజీపేట్‌ను రైల్వే డివిజన్‌గా ప్రకటించాలి: రైల్వే ఎంప్లాయిస్ జేఏసీ
X

దిశ, హనుమకొండ టౌన్: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కాజీపేట్‌కు వెంటనే రైల్వే డివిజన్ ప్రకటించాలని తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జేఏసీ డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినట్లే మరో ఉద్యమానికి సిద్ధం అని జేఏసీ నాయకుల స్పష్టీకరణ చేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం భూములు కోల్పోయిన కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో అవసరమైతే ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు, ఉద్యోగులు కలుపుకుని ఉద్యమాన్ని దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జేఏసీ నాయకులు ప్రకటించారు.

Next Story