నవోదయ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం: ప్రిన్సిపాల్

by Kodari Anjali |

ఆరవ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ తెలిపారు.

నవోదయ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం: ప్రిన్సిపాల్
X

దిశ, వర్గల్: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు జూలై 31లోగా ఆన్‌లైన్‌లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష నవంబర్ 28న నిర్వహించనున్నట్లు, పూర్తి వివరాలకు www.navodaya.gov.inను సందర్శించాలని పేర్కొన్నారు.

Next Story