కారేపల్లిలో కామాంధుడు.. పశువులను కూడా వదలట్లే..

by Dishanational1 |
కారేపల్లిలో కామాంధుడు.. పశువులను కూడా వదలట్లే..
X

దిశ, కారేపల్లి: కారేపల్లి కామాంధుడి వికృత చేష్టలతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది వృద్ధురాలిపై ఆత్యాచారం, ఆపై హత్యచేసి జైలుకు వెళ్లివచ్చిన కామాంధుడు తన చర్యలను ఆపలేదు. బర్రె దూడపై వికృతంగా వ్యవహరిస్తుండగా అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. కారేపల్లికి చెందిన ఆదెర్ల ఉపేందర్‌ అనే వ్యక్తి సైకోగా వ్యవహరిస్తూన్నాడు. గతేడాది వృద్ధురాలిపై ఆత్యాచారం జరిపి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి రైలు పట్టాలపై పడేశాడు. ఆ కేసు విషయమై ఉపేందర్‌ జైలుకు వెళ్లివచ్చాడు. ఆ కేసు కొనసాగుతోంది. అయినా అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. శుక్రవారం రాత్రి అర్ధనగ్నంగా ఆదెర్ల శ్రీను ఇంటికి వచ్చి అక్కడ కట్టేసిన బర్రె దూడపై తన లైగింగ వికృత్వాన్ని చూపాడు. దీనిని ఇంటి కుటుంబీకులు సెల్‌ ఫోన్‌లో చిత్రికరించి అనంతరం పట్టుకోవటానికి ప్రయత్నించగా పారిపోయాడు. కారేపల్లి సమీపంలోని చెరువు వద్ద ఉపేందర్‌ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఉపేందర్‌ వికృత చేష్టాలతో తాము వేగలేకపోతున్నామని, అతనిని గ్రామంలో నుండి పంపించేయాలని పోలీసులను కాలనీ వాసులు కోరారు. శ్రీను ఫిర్యాదు మేరకు కారేపల్లి ఎస్సై పోలోజు కుశకుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story