భారత మార్కెట్లోకి అధునాతన ఫీచర్లతో JBL పోర్టబుల్ స్పీకర్‌

by Disha Web Desk 17 |
భారత మార్కెట్లోకి అధునాతన ఫీచర్లతో JBL పోర్టబుల్ స్పీకర్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఆడియో పరికరాల ఉత్పత్తుల సంస్థ JBL అధునాతన ఫీచర్లతో కొత్త పోర్టబుల్ స్పీకర్‌ JBL ఫ్లిప్ 6ను బుధవారం విడుదల చేసింది. దీని ధర రూ. 14,999. JBL ఫ్లిప్ 6 ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్‌లలో ఓషన్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్, స్క్వాడ్ కలర్స్‌లో లభిస్తుంది. JBL అత్యాధునిక సౌండ్ టెక్నాలజీతో వస్తుందని HARMAN ఇండియా లైఫ్‌స్టైల్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ ఖేర్ తెలిపారు. JBL ఫ్లిప్ 6 డ్యూయల్ పాసివ్ రేడియేటర్లు, శక్తివంతమైన రేస్ట్రాక్-ఆకారపు వూఫర్, సరికొత్త ఆడియో కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంది. బాస్ నుంచి మొదలుకొని అన్ని సౌండ్స్‌ను క్లారిటీతో అందిస్తోందని కంపెనీ తెలిపింది. JBL ఫ్లిప్ 6 బ్లూటూత్ 5.1 వైర్‌లెస్ కనెక్టివిటిని కలిగి ఉంది. Android, iOS డివైజ్‌లతో పాటు PCలకు కూడా తోందరగా కనెక్ట్ అవుతుంది. ధుమ్ము, నీటి నీరొధకత కోసం IP67 రేటింగ్‌‌తో వస్తుంది. బయటి ప్రదేశాలకు, పార్టీల కోసం స్పీకర్‌ను తీసుకెళ్లడానికి సులభంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

Next Story

Most Viewed