- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కువైట్, బహ్రెయిన్లపై మిస్సైల్స్ వర్షం
హర్ముజ్, క్వేష్ దీవులపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని యుఎస్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురిపించింది.

దిశ, వెబ్ డెస్క్ : హర్ముజ్, క్వేష్ దీవులపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని యుఎస్ (US) సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే కువైట్, బహ్రెయిన్లలోని కీలక సైనిక స్థావరాలపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) విరుచుకుపడింది. ఈ దాడులకు తాము "హజ్ ఖాసెం" క్షిపణులు, అత్యాధునిక డ్రోన్లను ఉపయోగించినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. కువైట్ లో అమెరికా సైనిక బలగాలు ఉన్న 'అలీ అల్ సలేమ్ ఎయిర్ బేస్' లక్ష్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే, కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి అనేక క్షిపణులను గాల్లోనే అడ్డుకున్నాయి. అయినప్పటికీ, కూలిపోయిన క్షిపణుల శిథిలాలు (Debris) కింద పడటంతో కొందరు గాయపడగా, ఆస్తి నష్టం సంభవించింది. గత మార్చి-ఏప్రిల్ నెలల్లో జరిగినట్లే, ఈసారి కూడా ఎయిర్పోర్ట్ ఇంధన ట్యాంకులను టార్గెట్ చేస్తూ దాడులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఇక బహ్రెయిన్లోని 'జుఫైర్' ప్రాంతంలో ఉన్న అమెరికా నౌకాదళానికి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన 'యూఎస్ నేవీ 5th ఫ్లీట్ హెడ్క్వార్టర్స్' పై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడి కారణంగా అక్కడ భారీ పేలుళ్లు సంభవించి, మంటలు చెలరేగాయి. క్షిపణుల శిథిలాలు పౌర నివాస ప్రాంతాల్లో పడటంతో పలువురు గాయపడ్డారు, ఒకరు మరణించినట్లు సమాచారం. ఈ ఆకస్మిక దాడుల నేపథ్యంలో గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాలైన కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పూర్తిగా ఆక్టివ్ చేసి, ప్రాణనష్టం పెద్ద ఎత్తున జరగకుండా నివారించగలిగారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అలర్ట్స్ జారీ చేసారు.






