- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్ 2026: సీఎస్కేకు అందుబాటులో ధోనీ.. కానీ అన్ని మ్యాచుల్లో ఆడటం అనుమానమే!
ఐపీఎల్ 2026కు ధోనీ రెడీ! సీఎస్కేకు అందుబాటులో ఉండనున్న 'థాలా'. సంజూ శామ్సన్ రాకతో ధోనీ అన్ని మ్యాచుల్లో ఆడటంపై సస్పెన్స్."

దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ కెప్టెన్, సీనియర్ ప్లేయర్ ఎమ్ఎస్ ధోని ఐపీఎల్కు అందుబాటులో ఉండటంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఎంఎస్ ధోనీ (MS Dhoni) భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. రాబోయే సీజన్లో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు అందుబాటులో ఉంటారని ఫ్రాంచైజీకి చెందిన ఒక ఉన్నత స్థాయి వర్గం ధృవీకరించింది. ఈ ఏడాది జూలైలో ఆయన 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నప్పటికీ, మైదానంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. అయితే, ధోనీ జట్టులో ఉన్నప్పటికీ ఈ సీజన్లో ఆయన అన్ని లీగ్ మ్యాచుల్లోనూ ఉండకపోవచ్చని తెలుస్తోంది.
దీనికి ప్రధాన కారణం సీఎస్కే ఈసారి సంజూ శామ్సన్ (Sanju Samson)ను జట్టులోకి తీసుకోవడమే. ఈ మెగా ట్రాన్స్ఫర్ ద్వారా శామ్సన్ జట్టులో చేరడంతో, వికెట్ కీపర్, కీలక బ్యాటర్ బాధ్యతలను పంచుకునే అవకాశం ఉంది. దీనివల్ల ధోనీపై పనిభారం తగ్గించడంతో పాటు, భవిష్యత్తు నాయకత్వం, జట్టు సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని ఆయనను కొన్ని మ్యాచులకు మాత్రమే పరిమితం చేసే యోచనలో ఫ్రాంచైజీ ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. తాజా సమాచారంతో ధోని అభిమానులు కాస్త నిరాశలోకి వెళ్ళిపోయారు.






