దేశంలో ఉపాధి రంగంలో పెట్టుబడులు పెరిగాయి: పీయూష్ గోయల్

by Disha Web Desk 17 |
దేశంలో ఉపాధి రంగంలో పెట్టుబడులు పెరిగాయి: పీయూష్ గోయల్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెరిగాయని తద్వారా ఉపాధి పెరుగుతుందని, ఇది ఓ మంచి పరిణామమని పీయూష్ గోయల్ అన్నారు. ఫోర్బ్స్ ఇండియా లీడర్‌షిప్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్, గతి శక్తి దేశంలోని అనేక ప్రభుత్వ ప్రాజెక్టులను వేగంగా ట్రాక్ చేయడంలో సహాయపడుతుందని అన్నారు. టెక్స్‌టైల్ క్లస్టర్‌లు, ఫార్మాస్యూటికల్ క్లస్టర్‌లు, ఎలక్ట్రానిక్ పార్కులు, ఇండస్ట్రియల్ కారిడార్లు వంటి ఆర్థిక మండలాలతో పాటు భారతమాల, సాగర్‌మాల, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్, ఉడాన్ పథకంతో సహా వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల మౌలిక సదుపాయాల పథకాలను చేర్చాలని PM గతి శక్తి కార్యక్రమం ఉద్దేశించింది.

కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ నష్టపోయిందని ఆయన అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 తో పోలిస్తే దేశ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడిందని, ప్రస్తుతం భారతదేశం ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయ ఆర్థిక వ్యవస్థగా ఉందని అన్నారు. దేశీయ ఎగుమతులు మొదటిసారిగా $400 బిలియన్లను అధిగమించాయని, సేవల ఎగుమతులు $250 బిలియన్లకు చేరువలో ఉన్నాయని తెలిపారు. భారతదేశ సేవలు, సరుకుల వాణిజ్యం తదుపరి 10 సంవత్సరాలలో అగ్ర స్థానానికి చేరుకోవాలని ఆశిస్తున్నట్లు పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed