‘దిశ’ ఎఫెక్ట్.. రావి కుంట కబ్జా పై ఇంటెలిజెన్స్ ఆరా

by Jakkula.Mamatha |

రావి కుంట కబ్జా పై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.

‘దిశ’ ఎఫెక్ట్.. రావి కుంట కబ్జా పై ఇంటెలిజెన్స్ ఆరా
X

దిశ, నల్లగొండ బ్యూరో: రావి కుంట కబ్జా పై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే.. మేళ్ల దుప్పలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 5.38 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కుంటను గ్రామానికి చెందిన ఓ భూస్వామి కబ్జా చేశారని తెలిసింది. అదే విషయాన్ని "దిశ " పత్రికలో ప్రచురితమైంది. ఆక్రమణపై పూర్తి వివరాలు స్వయంగా తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్ అధికారులు రావి కుంటను సందర్శించినట్లు తెలుస్తోంది. గ్రామస్తులతో మాట్లాడి వాస్తవాలను తెలుసుకున్నట్లు సమాచారం. సాయంత్రం వరకు పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు వినికిడి.

Next Story