రైతు బీమాపై భారీ షాక్.. 7,606 క్లెయిమ్‌లు పెండింగ్ !

by Batti.Sumithra |

రైతు బీమా క్లెయిమ్‌లు 7,606 పెండింగ్‌లో ఉన్నాయని, ఇందుకు రూ.441.23 కోట్ల ప్రీమియం బకాయిలే కారణమని పేర్కొంటూ, ప్రభుత్వం వెంటనే ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు.

రైతు బీమాపై భారీ షాక్.. 7,606 క్లెయిమ్‌లు పెండింగ్ !
X

దిశ, కామారెడ్డి : రైతు బీమా పథకం రైతు కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ప్రారంభించబడిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసీకి చెల్లించాల్సిన రూ.441.23 కోట్ల ప్రీమియం బకాయిల కారణంగా 7,606 రైతు బీమా క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే ప్రభుత్వం ప్రీమియం చెల్లించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు. రైతు కుటుంబాలకు న్యాయం చేయాలంటే వెంటనే బకాయిలు చెల్లించి, పెండింగ్ క్లెయిమ్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు బతికున్నప్పుడు గౌరవం అని, రైతు లేనప్పుడు కుటుంబానికి భరోసా అవుతుందని అదే నిజమైన రైతు సంక్షేమం అన్నారు.

Next Story