ఎరువులు, క్రిమిసంహారక మందుల దుకాణాల్లో తనిఖీలు

by Batti.Sumithra |

భిక్కనూరు మండల కేంద్రంలో ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాలు విక్రయించే దుకాణాల్లో మంగళవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఎరువులు, క్రిమిసంహారక మందుల దుకాణాల్లో తనిఖీలు
X

దిశ, భిక్కనూరు : భిక్కనూరు మండల కేంద్రంలో ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాలు విక్రయించే దుకాణాల్లో మంగళవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. మండల వ్యవసాయ శాఖ అధికారి నాగరాజు, ఎస్‌ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నకిలీ విత్తనాలు, క్రిమిసంహారక మందులు విక్రయిస్తున్నారా అనే అంశాన్ని పరిశీలించారు. అలాగే, దుకాణాల్లో ఉన్న స్టాక్‌కు అనుగుణంగా బిల్లులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా తనిఖీ చేశారు. ఎవరైనా నకిలీ విత్తనాలు, క్రిమిసంహారక మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని దుకాణ యజమానులను హెచ్చరించారు. స్టాక్‌ వివరాలను ఎప్పటికప్పుడు స్టాక్‌ రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు.

Next Story