పాకిస్తాన్ రాజకీయ సంక్షోభంపై భారత్ కామెంట్స్..

by Dishafeatures2 |
పాకిస్తాన్ రాజకీయ సంక్షోభంపై భారత్ కామెంట్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్-పాకిస్తాన్‌ ఇరుదేశాలు ఒకరి విషయంలో మరొకరు కలిగించుకోరు. ఒకవేళ ఏదైనా విషయంపై మాట్లాడారంటే.. ఆ విషయం పెద్ద దుమారమే రేగుతుంది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. అయితే తాజాగా పాకిస్తాన్‌లోని రాజకీయ సంక్షోభంపై భారత విదేశాంగ శాఖ మంత్రివర్గం స్పందించింది. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్న భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీని పాకిస్తాన్ రాజకీయ సంక్షోభంపై ప్రశ్నించగా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. 'పాకిస్తాన్ రాజకీయ సంక్షోభంపై నేను మాట్లాడదలచుకోలేదు. ఈ విషయంలో నో కామెంట్స్' అన్నారు. అంతేకాకుండా 'పాకిస్తాన్‌లో సంభవిస్తున్న పరిణామాలను మేమూ చూస్తున్నాం. అవి ఆ దేశ అంతర్గత విషయం. వాటిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దు' అని అన్నారు.


Next Story

Most Viewed