ఇండియా మిస్సైల్ ట్రైల్.. బ్రహ్మోస్ సక్సెస్..

by Dishafeatures2 |
ఇండియా మిస్సైల్ ట్రైల్.. బ్రహ్మోస్ సక్సెస్..
X

దిశ, వెబ్‌డెస్క్: రక్షణ విషయంలో భారత ప్రభుత్వం ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఎప్పటికప్పుడు సరికొత్త మిస్సైల్స్‌ను పరీక్షిస్తోంది. ఇదే క్రమంలో బుధవారం భారత ప్రభుత్వం సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించింది. ఈ పరీక్షలను అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్వహించింది. ఇందులో భారత క్షిపణి సరిగ్గా గుర్తించిన లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. భారత నావికా దళం బ్రహ్మోస్ విషయంలో గొప్ప విజయం సాధించిందని, లక్ష్య ఛేదనలో బ్రహ్మోస్ అద్భుతంగా పనిచేసిందని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి తెలిపారు. అంతేకాకుండా గత నెలలో మొదటిసారి చెన్నై ఐఎన్ఎస్ నుంచి బ్రహ్మోస్ క్లిపణిని విజయవంతంగా పరీక్షించిందని తెలిపారు. ఇదే తరహాలో భారత రక్షణ దళం విజయం సాధించాలని వారు అన్నారు.

Next Story

Most Viewed