ట్రై-సిరీస్.. ఇండియా-A జట్టు ప్రకటన.. వైభవ్ కు చోటు

by Muthe.Rajitha |

శ్రీలంక వేదికగా జూన్ నెలలో జరగనున్న వన్డే ట్రై-సిరీస్ కోసం బీసీసీఐ (BCCI) ఇండియా -A జట్టును ప్రకటించింది.

ట్రై-సిరీస్.. ఇండియా-A జట్టు ప్రకటన.. వైభవ్ కు చోటు
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీలంక వేదికగా జూన్ నెలలో జరగనున్న వన్డే ట్రై-సిరీస్ కోసం బీసీసీఐ (BCCI) ఇండియా -A జట్టును ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక త్రిముఖ పోరులో భారత్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు చెందిన 'ఏ' జట్లు తలపడనున్నాయి. కాగా యువ ఆటగాళ్ల నైపుణ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరీక్షించడానికి ఈ సిరీస్ ఒక చక్కని వేదికగా నిలవనుంది. వైట్ బాల్ ఫార్మాట్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌లకు డాంబుల్లా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

ఈ వన్డే ట్రై-సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టుకు యువ సంచలనం తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, రియాన్ పరాగ్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. జట్టులో దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశి, అయుష్ బడోని వంటి బ్యాటర్లతో పాటు నిశాంత్ సింధు, హర్ష్ దుబే, సూర్యాంశ్ షెడ్జ్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లకు చోటు దక్కింది. వికెట్ కీపర్లుగా ప్రభ్‌సిమ్రన్ సింగ్, కుమార్ కుషాగ్ర ఎంపికయ్యారు. బౌలింగ్ విభాగంలో యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అంశుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్, విప్రాజ్ నిగం తమ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో సీనియర్ జట్టుకు బ్యాకప్ ఆటగాళ్లను సిద్ధం చేసే క్రమంలో ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది.

Next Story