- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
State Revenue: పెరిగిన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం
తెలంగాణ ఆదాయంలో జోరు! 2024-25తో పోలిస్తే పెరిగిన పన్ను రాబడి. ఈ వృద్ధిని ఆధారంగా చేసుకుని 2026-27 బడ్జెట్లో రూ. 20 వేల కోట్ల అదనపు అంచనాలు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం క్రమ క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పెరిగినట్లు ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించిన వివరాలు స్పష్టం చేస్తున్నాయి. స్టేట్ఓన్టాక్స్రెవెన్యూ (ఎస్వోటీఆర్)తో సహా ఎస్జీఎస్టీ, సేల్స్టాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్టాక్స్, మోటార్వెహికిల్ టాక్స్ పన్నులపై ఎకానామిక్అవుట్ లుక్ నివేదికను వెల్లడించింది. ఈ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గత ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక సంవత్సరంలో పెరిగిందని వివరాలను వెల్లడిస్తున్నాయి.
20 వేల కోట్ల అంచనా
ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో మొదటి మూడు క్వార్టర్స్లో విభాగాల వారిగా ఆదాయాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే అధికంగా ఉంటుందనే అంచనాతోనే గత బడ్జెట్కంటే 20వేల కోట్ల అంచనాలను పెంచి బడ్జెట్ను ప్రతిపాదించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, మెట్రో, బుల్లెట్ ట్రైన్, మూసీ, ఫ్యూచర్ సిటీ, ట్రిపుల్ఆర్తదితర వాటి ద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెరిగి ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ అధికారులు 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఆదాయంపై భారీగా ఆశలు పెట్టుకున్నారు.






