ధాన్యం కొనకుంటే మోదీ ప్రభుత్వానికి ఘోరీ కడతాం

by Disha Web Desk |
ధాన్యం కొనకుంటే మోదీ ప్రభుత్వానికి ఘోరీ కడతాం
X

దిశ, ఖిలా వరంగల్ : తెలంగాణ రైతులు పండించిన వరిధాన్యం కొనకుంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ఘోరీ కడతామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. తెలంగాణ ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరికి నిరసనగా వరంగల్‌లోని నాయుడు పంప్ జంక్షన్ వద్ద ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, రైతు సమన్వయ సమితి ప్రతినిధులు, రైతులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story