- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
హైదరాబాద్ సీపీతో మజ్లిస్ నేతల సమావేశం.. రాత్రిపూట షాపింగ్కు గ్రీన్ సిగ్నల్
by Dishafeatures2 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: రంజాన్ సందర్భంగా రాత్రిపూట దుకాణాలు తెరుచుకునేందుకు సహకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ను మజ్లిస్ నేతలు కోరారు. గురువారం సీపీని కలిసి.. రాత్రి వేళల్లో ప్రజలను పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై సీపీ వెంటనే స్పందించి.. గురువారం రాత్రి నుంచి పూర్తిస్థాయిలో వ్యాపారాలు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చారు. రంజాన్ మాసంలో పాతబస్తీలోని చార్మినార్ వద్ద జరిగే రాత్ బజార్కు ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల రోజులు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. గత రెండు, మూడు రోజులుగా ఎంఐఎం కార్పొరేటర్లు సిటీ పోలీసులతో అర్ధరాత్రి వాగ్వాదం చేసిన నేపథ్యంలో మజ్లిస్ నేతలు సీపీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story