- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ సీపీతో మజ్లిస్ నేతల సమావేశం.. రాత్రిపూట షాపింగ్కు గ్రీన్ సిగ్నల్
by Javid Pasha |
దిశ, డైనమిక్ బ్యూరో: రంజాన్ సందర్భంగా రాత్రిపూట దుకాణాలు తెరుచుకునేందుకు సహకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ను

X
దిశ, డైనమిక్ బ్యూరో: రంజాన్ సందర్భంగా రాత్రిపూట దుకాణాలు తెరుచుకునేందుకు సహకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ను మజ్లిస్ నేతలు కోరారు. గురువారం సీపీని కలిసి.. రాత్రి వేళల్లో ప్రజలను పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై సీపీ వెంటనే స్పందించి.. గురువారం రాత్రి నుంచి పూర్తిస్థాయిలో వ్యాపారాలు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చారు. రంజాన్ మాసంలో పాతబస్తీలోని చార్మినార్ వద్ద జరిగే రాత్ బజార్కు ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల రోజులు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. గత రెండు, మూడు రోజులుగా ఎంఐఎం కార్పొరేటర్లు సిటీ పోలీసులతో అర్ధరాత్రి వాగ్వాదం చేసిన నేపథ్యంలో మజ్లిస్ నేతలు సీపీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story






