- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిజిస్ట్రేషన్ శాఖకు.. దండిగా ఆదాయం
by Vinod kumar |
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో స్టాంప్స్అండ్రిజిస్ట్రేషన్ - Huge revenue this year through stamps and registration

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో స్టాంప్స్అండ్రిజిస్ట్రేషన్ ద్వారా ఈ ఏడాది భారీగా ఆదాయం వచ్చింది. ప్రభుత్వం అంచనా వేసినట్టుగానే ఆదాయం రెట్టింపు అయింది. మార్కెట్ధరల పెంపుతో రాబడి పెరిగింది. ఒకే ఏడాది ఇంత భారీ స్థాయిలో ఆదాయం రావడం ఇదే తొలిసారి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2021–22)లో రూ.12,364 కోట్లు రిజిస్ట్రేషన్ల ద్వారా సమకూరింది.
ఇందులో సేల్స్డీడీల ద్వారా రూ. 8,364 కోట్లు, మార్టిగేజ్ద్వారా రూ. 2030 కోట్లు వచ్చాయి. అంతకు ముందు 2020–21లో వచ్చిన ఆదాయం రూ. 5260 కోట్లు మాత్రమే. కానీ ఈసారి రెండింతలు వచ్చింది. ఇక మార్చి నెలలో రూ. 1501 కోట్లు సమకూరాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో 3,513 కోట్లు రాగా, మేడ్చల్ నుంచి రూ. 1987 కోట్లు వచ్చాయి.
Next Story






