హిజాబ్‌కు అక్కడ నో ఎంట్రీ.. మంత్రి కీలక వ్యాఖ్యలు

by Dishafeatures2 |
హిజాబ్‌కు అక్కడ నో ఎంట్రీ..  మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా హిజాబ్ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అయితే తాజాగా ఇదే వ్యవహారంలో కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై బోర్డు పరీక్షల్లో సైతం హిజాబ్‌కు అనుమతిం లేదని తెలిపారు. ' బోర్డు పరీక్షల్లో సైతం హిజాబ్‌కు అనుమతి లేదు. ప్రతి ఒక్కరు హైకోర్టు తీర్పును అనుసరించాలి' అని తెలిపారు. అంతేకాకుండా 'ఒకవేళ విద్యార్థినులు తమ తప్పు తెలుసుకుంటే వారు సప్లమెంటరీ పరీక్షలు రాసుకునేందుకు అనుమతి ఇస్తాం. కానీ అప్పుడు కూడా హిజాబ్‌కు ఎంట్రీ ఉండదు' అని తేల్చిచెప్పారు.

Next Story