ట్రయల్ కోర్టు కాపీ పేస్ట్ తీర్పు.. మండిపడ్డ హైకోర్ట్

by Muthe.Rajitha |

న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలి కానీ, దానిని దుర్వినియోగం చేస్తూ తీర్పులనే కాపీ-పేస్ట్ చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది.

ట్రయల్ కోర్టు కాపీ పేస్ట్ తీర్పు.. మండిపడ్డ హైకోర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలి కానీ, దానిని దుర్వినియోగం చేస్తూ తీర్పులనే కాపీ-పేస్ట్ చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది. ఒక చెక్ బౌన్స్ కేసులో ట్రయల్ కోర్టు మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వేరే కేసులో గతంలో వెలువడిన ఒక తీర్పును యథాతథంగా కాపీ చేసి, ప్రస్తుత కేసు తీర్పుగా ప్రకటించడాన్ని ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా ఖండించింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన సదరు కాపీ తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు.. కేసుల పరిష్కారంలో కేవలం టెక్నాలజీపైనే ఆధారపడకుండా, న్యాయమూర్తులు తమ విచక్షణను, మనసును పెట్టి పని చేయాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. కాపీ-పేస్ట్ సంస్కృతి న్యాయప్రక్రియకే ముప్పని పేర్కొంటూ, ట్రయల్ కోర్టు ఇచ్చిన పాత తీర్పును కొట్టేసింది. ఈ చెక్ బౌన్స్ కేసును మొదటి నుంచి నిష్పాక్షికంగా విచారించాలంటూ కేసును పునర్విచారణకు ఆదేశించింది.

Next Story