నామినేషన్ వేసిన గుత్తా.. పాల్గొన్న పలువురు మంత్రులు

by Dishafeatures2 |
నామినేషన్ వేసిన గుత్తా.. పాల్గొన్న పలువురు మంత్రులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : శాసన మండలి చైర్మన్ పదవికి గట్టి పోటీనే జరుగుతోంది. తాజాగా ఈ పదవి కోసం శాసన మండలి సభ్యులు, మాజీ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్ వేశారు. ఆయన తన నామినేషన్‌ను ఆదివారం ఉదయం 10.40 నిమిషాలకు శాసన సభ సచివాలయంలోని సెక్రెటరీ ఛాంబర్‌లో దాఖలు చేయడం జరిగింది.

ఈ కార్యమానికి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఏం ఎస్ ప్రభాకర్ రావు, విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీలు భాను ప్రసాద రావు, దామోదర్ రెడ్డి, గంగాధర్ గౌడ్, ఎగ్గే మల్లేశం, రఘోత్తమ రెడ్డి, జనార్దన్ రెడ్డి, దండే విఠల్, నవీన్ కుమార్, బస్వరాజ్ సారయ్య, బండ ప్రకాష్, శేరి శుభాష్ రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు భాస్కరరావు, భూపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి, మెతుకు ఆనంద్, మల్లయ్య యాదవ్, ఏం పి బడుగుల లింగయ్య యాదవ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story