ఈ నెల 26న గవర్నర్ తమిళి సై నల్లమల పర్యటన

by Dishanational1 |
ఈ నెల 26న గవర్నర్ తమిళి సై నల్లమల పర్యటన
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని లింగాల మండల పరిధిలోగల అప్పాపూర్ మరియు బై రాపూర్ చెంచు పంటలను రాష్ట్ర గవర్నర్ తమిళి సై సందర్శనకు సంబంధించి ఈ నెల 26న పర్యటన ఖరారు అయ్యింది. నల్లమలలోని బైరాపూర్, అప్పాపూర్ పంటలను గవర్నర్ తమిళి సై దత్తత తీసుకున్న విషయం విధితమే. రెడ్ క్రాస్ ద్వారా ఆదివాసీలకు ఆరోగ్యం మరియు న్యూట్రిషన్ అందించేలా గత మూడు నెలలుగా రెడ్ క్రాస్ సంస్థ సేవలను అందిస్తుంది. ఈ నేపథ్యంలో చెంచుల స్థితిగతులను, ఆరోగ్య విషయాలను స్వయంగా తెలుసుకోనున్నారు. ఈ విషయంపై జిల్లా వైద్య శాఖ అధికారి రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ సుధాకర్ లాల్ ను దిశ పత్రిక చరవాణి ద్వారా వివరణ కోరగా వాస్తవమే అని తెలిపారు. గవర్నర్ పర్యటనకు సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు జరుగుతాయని ఆయన తెలిపారు.


Next Story

Most Viewed