విరాట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ మ్యాచ్‌కు ఫ్యాన్స్‌కు అనుమతి

by Web Desk |
విరాట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ మ్యాచ్‌కు ఫ్యాన్స్‌కు అనుమతి
X

దిశ, వెబ్ డెస్క్: విరాట్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ శుభవార్త చేప్పింది. కోహ్లీ తన 100వ టెస్ట్ మ్యాచ్‌కు 50 శాతం అభిమానులను స్టేడియంలోకి అనుమతించనుంది. భారత్-శ్రీలంక మధ్య జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్ కు ప్రేక్షకులకు అనుమతి లభించింది. సూపర్ స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కి మైలురాయి అయిన 100వ టెస్ట్ మ్యాచ్ భారత్-శ్రీలంక ల మధ్య 'మార్చి 4న' మొహాలి వేదికగా జరుగనుంది.

ఈ మ్యాచ్ ను అభిమానులు చూడటానికి అనుమతించినట్లు బీసీసీఐ సెక్రటరీ జే షా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 50 శాతం స్టేడియం సామర్ధ్యంతో టెస్ట్ మ్యాచ్ జరుగుతుందని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేసింది. కాగా నేటి నుంచి ఆన్ లైన్ లో టికెట్లు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు పిసిఎ సభ్యులు సింగ్లా తెలిపారు.


Next Story

Most Viewed