ఐపీఎల్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. అభిమానులకు ఇక పండగే..

by Disha Web Desk 12 |
ఐపీఎల్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. అభిమానులకు ఇక పండగే..
X

న్యూఢిల్లీ : ఐపీఎల్ అంటే అభిమానుల హంగామా మామూలుగా ఉండదు. తమ ఫేవరేట్ ఆటగాడు బౌండరీ బాదితేనో.. వికెట్ తీస్తేనే అభిమానులు చేసే సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. అయితే, కొన్ని సీజన్లుగా ఐపీఎల్ అభిమానులకు ప్రత్యేక్షంగా మజాను అందించలేకపోయింది. కరోనా కారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరిగాయి. అయితే, ఈ ఏడాది స్టేడియాల్లో మరోసారి ప్రేక్షకుల విజిల్స్, కేకలు వినిపించనున్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు బీసీసీఐ అనుమతినిచ్చింది. మొదటి నుంచి చెబుతున్నట్టుగానే స్టేడియం కెపాసిటీలో 20 శాతం ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించనుంది.

ఈ విషయాన్ని నిర్వాహకులు బుధవారం స్పష్టం చేశారు. బుధవారం నుంచి లీగ్ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు బుక్ మై షో వెబ్‌సైట్‌లో టికెట్లను అభిమానులు పొందవచ్చని పేర్కొన్నారు. కాగా, మరో మూడు రోజుల్లో ఐపీఎల్-15 సీజన్ ప్రారంభం కానుండగా.. ఈ నెల 26న వాఖండే స్టేడియం వేదికగా జరిగే ప్రారంభ మ్యాచ్‌లో చెన్నయ్ సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి.

Next Story

Most Viewed