ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఈ సారి నేరుగా..

by Disha Web Desk 19 |
ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఈ సారి నేరుగా..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ అభిమానులకు మహారాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరోన కారణంగా గత రెండు ఐపీఎల్ సీజన్లకు.. బీసీసీఐ స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించని విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోన కాస్త తగ్గు ముఖం పట్టడంతో ఈ సీజన్‌ను భారత్‌లోనే నిర్వహిస్తుంది. అంతే కాకుండా ఈ సారి మ్యాచ్‌లకు స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు తాజాగా మహారాష్ట్ర సర్కార్ ప్రకటించింది. స్టేడియం మొత్తం కెపాసిటీలో 25శాతం మంది ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు తెలిపింది. కాగా, మార్చి 26న క్యాచ్ రిచ్ లీగ్ ఐపీఎల్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్ సీజన్ మ్యాచ్‌లు మొత్తం మహారాష్ట్రలోని వాంఖడే, డీవై పాటిల్, బ్రబౌర్న్, పుణెలో జరగనున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సారి రెండు కొత్త జట్లు రావడంతో ఈ సీజన్ ఇంకా రసవత్తరంగా సాగనుంది.


Next Story

Most Viewed