గోల్డ్ బాండ్స్.. అపుడు లక్ష పెట్టుబడి, ఇపుడు రూ.3.8 లక్షలు

by Muthe.Rajitha |

సావరిన్ గోల్డ్ బాండ్స్(SGB's) అంటే ప్రభుత్వం ద్వారా జారీ చేసే బంగారం పెట్టుబడి పథకం.

గోల్డ్ బాండ్స్.. అపుడు లక్ష పెట్టుబడి, ఇపుడు రూ.3.8 లక్షలు
X

దిశ, వెబ్ డెస్క్ : సావరిన్ గోల్డ్ బాండ్స్(SGBలు) అంటే ప్రభుత్వం ద్వారా జారీ చేసే బంగారం పెట్టుబడి పథకం. 2020లో కోవిడ్ సమయంలో చాలా మంది ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టారు. అప్పట్లో ఒక గ్రాము బంగారం ధర సుమారు రూ.4,500 నుంచి రూ.5,300 మధ్య ఉండేది. అంటే రూ.1 లక్ష పెట్టినవారు సుమారు 20 నుంచి 22 గ్రాముల వరకు బాండ్లు కొనుగోలు చేయగలిగారు. ఇప్పుడు 2026 ఫిబ్రవరిలో అదే బాండ్ల విలువ భారీగా పెరిగింది. కొన్ని సిరీస్‌లలో ఒక్క గ్రాము రిడెంప్షన్ ధర రూ.15,000 నుంచి రూ.15,440 వరకు ఉంది. అంటే రూ.1 లక్ష పెట్టుబడి ఇప్పుడు సుమారు రూ.3 లక్షల నుంచి రూ.3.8 లక్షల వరకు పెరిగింది.

ఇలా ఎక్కువ లాభం రావడానికి ప్రధాన కారణం ఈ ఐదేళ్ళలో బంగారం ధరలు భారీగా పెరగడం. 2020లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.48,000 నుంచి రూ.50,000 మధ్య ఉండేది. ఇప్పుడు అదే 10 గ్రాములు సుమారు రూ.1,58,000 వరకు చేరింది. అంటే బంగారం ధర దాదాపు మూడు రెట్లు పెరిగింది. దీనికి తోడు SGBలపై ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2.5% వడ్డీ ఇస్తుంది. ఈ వడ్డీ ఆరు నెలలకు ఒకసారి ఇస్తారు. ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లో ఈ వడ్డీ రూపంలో మరో రూ.12,000 నుంచి రూ.15,000 వరకు అదనంగా లాభం వచ్చింది. అందుకే మొత్తం రాబడి చాలా ఎక్కువగా కనిపిస్తోంది.

మరొక ముఖ్యమైన లాభం టాక్స్ ప్రయోజనం. SGBలను పూర్తిగా మెచ్యూరిటీ వరకు ఉంచితే క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ ఉండదు. కొన్ని సిరీస్‌లకు 5 సంవత్సరాల తర్వాత ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ అవకాశం ఉంది. మార్కెట్‌లో NSE, BSEలలో కూడా గోల్డ్ బాండ్లు ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఒక్క యూనిట్ ధర రూ.15,000 నుంచి రూ.18,000 వరకు ఉంది. కావాలంటే ఇప్పుడు అమ్మి లాభం తీసుకోవచ్చు లేదా మెచ్యూరిటీ వరకు ఉంచి వడ్డీతో పాటు టాక్స్ ఫ్రీ లాభం పొందవచ్చు. SGBలు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి మంచి మార్గం. ఇంట్లో బీరువాలో బంగారం లాగా భద్రపరచాల్సిన అవసరం లేదు. వడ్డీ కూడా వస్తుంది. పైగా టాక్స్ ప్రయోజనాలు కూడా ఉంటాయి. అందుకే చాలా మంది దీన్ని మంచి పెట్టుబడి అవకాశంగా చూస్తున్నారు.

Next Story