మచిలీపట్నం-విజయవాడ హైవేపై ఘోరప్రమాదం.. ఇద్దరు మృతి

by Naga Rani Yarlagadda |

మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

మచిలీపట్నం-విజయవాడ హైవేపై ఘోరప్రమాదం.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన బైక్ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలి గ్రామం వద్ద జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story