వామ్మో.. ఈ కరెంట్ బిల్లు చూస్తే షాకే!

by Dishanational1 |
వామ్మో.. ఈ కరెంట్ బిల్లు చూస్తే షాకే!
X

దిశ, గోదావరిఖని టౌన్: కరెంట్ బిల్లును చూసి వారు షాక్ కు గురయ్యారు. ఆ బిల్లు చూసిన తర్వాత వారు షాక్ నుండి తేరుకుందుకు చాలా సమయం పట్టింది.. ఇంత బిల్లు ఎప్పుడు చూడలేదని, పేదవారు అయిన వారు దానిని ఎలా కట్టాలని ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ పీకే రామయ్య కాలనీకి చెందిన విజయ్ మండల్ నిరుపేద కుటుంబం కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎన్నడూ లేనంతగా ఈ నెల కరెంటు బిల్లు రూ.30,738 వచ్చి వారిని షాక్ కు గురి చేసింది. రోజు కూరగాయలు అమ్ముకుని జీవించేవారికి ఇంత కరెంట్ బిల్లు రావడంతో ఏమిచేయాలో అర్థం కాలేదు. వెంటనే స్థానిక కార్యాలయానికి వెళ్లి బిల్లు గురించి ఆరా తీశారు. అయితే అధికారులు తమకు సంబంధం లేదని చెప్పడంతో ఇంటికి తిరిగి వచ్చారు. ఏమిచేయాలో పాలుపోక బోరున విలపిస్తున్నారు. అంత డబ్బు తాము జీవితం మొత్తం కష్టపడ్డ కట్టలేమని అంటున్నారు. దీనిపై సంబంధిత అధికారులు మీటర్లపై విచారణ జరిపించి ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

Next Story

Most Viewed