- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ ఘాతంతో మేక మృతి.. ప్రభుత్వ సాయం కోరిన గొర్రెల కాపరి
by Ratna Kumari |
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఇప్పపెల్లి గ్రామ లంబాడి తండాకు చెందిన గుగులోత్ రవి జీవనోపాధి కోసం మేకలను మేపుకుంటూ జీవిస్తున్నాడు.

X
దిశ, కథలాపూర్ : జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఇప్పపెల్లి గ్రామ లంబాడి తండాకు చెందిన గుగులోత్ రవి జీవనోపాధి కోసం మేకలను మేపుకుంటూ జీవిస్తున్నాడు. ప్రతిరోజులాగే గురువారం తనకు చెందిన మేకలను మేతకు తీసుకెళ్లగా, అనుకోకుండా ఓ మేక విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందింది. మృతి చెందిన మేక విలువ సుమారు రూ.10 వేల వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు. ఈ ఘటనతో తనకు ఆర్థికంగా నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేసిన రవి, ప్రభుత్వం స్పందించి తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
Next Story






