‘జన నాయగన్’ మూవీ చూస్తూ మంత్రి కన్నీళ్లు

by velandi.Saikiran |   (  Updated:2026-07-23 10:54:08  IST  )

‘జననాయగన్’ మూవీ చూస్తూ త‌మిళ‌నాడు మంత్రి కన్నీళ్లు పెట్టుకున్నారు.

‘జన నాయగన్’  మూవీ చూస్తూ మంత్రి కన్నీళ్లు
X

దిశ‌, వెబ్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమా జన నాయగన్ సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. వాస్తవానికి మొన్నటి సంక్రాంతి కానుకగానే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనేక రకాల చిక్కులు రావడంతో.. సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా రిలీజ్ కు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ క్రమంలో ఇవాళ సినిమా రిలీజ్ అయి... దూసుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు కార్మిక సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ పర్వేజ్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తెరపైన సీఎం విజయ్ ప్రదర్శన చూసి.. ఎమోషనల్ అయ్యారు. విజయ్ ని చివరిసారిగా తెరపై చూస్తున్నామని.. ఇక ఆయన సినిమాలు రాబోవు అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాను చూసేందుకు చెన్నైలోని రోహిణి థియేటర్ కు హీరోయిన్ త్రిష వచ్చి సందడి చేశారు. క్లిక్

Next Story