చేతగాని తనం వల్లే గ్యాస్ లీక్ ఘటనలు: సోము వీర్రాజు

by Disha Web Desk 22 |
చేతగాని తనం వల్లే గ్యాస్ లీక్ ఘటనలు: సోము వీర్రాజు
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ జిల్లా అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌లో విష వాయువులు లీకై బ్రాండిక్స్‌ సీడ్స్‌–2 కంపెనీలో పనిచేసే 100 మందికి పైగా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురైన విషయం తెలిసందే.. దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు స్పందించారు. అస్వస్థతకు గురైన మహిళలకు వేగంగా వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేతగాని తనం కారణంగానే వరస గ్యాస్ లీక్ ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. పరిశ్రమలపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. అనకాపల్లిలోని బీజేపీ కార్యకర్తలు కార్మికులకు అండగా ఉండాలని వీర్రాజు సూచించారు.

Next Story

Most Viewed