- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్డెస్క్: పెట్రోలియం కంపెనీలు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్ల ధరను మార్చి 1, మంగళవారం నుండి రూ. 105 పెంచాయి. అయితే, ఈ ధర కేవలం కమర్షియల్ LPG సిలిండర్లకు మాత్రమే వర్తిస్తుంది. కాగా, వంటగ్యాస్ ధరలు మాత్రం అలాగే ఉన్నాయి.
ఈ సవరణతో దేశ రాజధానిలో ఇప్పుడు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,012 అవుతుంది. గత నెలలో, పెట్రోలియం కంపెనీలు 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధరను రూ.91.50 తగ్గించాయి. అంతేకాకుండా, 5 కిలోల సిలిండర్ ధర కూడా 27 రూపాయలు పెరిగింది. దీంతో 5 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో 569 రూపాయలు అవుతుంది.
Next Story






