యాదాద్రి భక్తులకు శుభవార్త.. ఇకపై ఫ్రీ బస్ ప్రయాణం

by Dishafeatures2 |
యాదాద్రి భక్తులకు శుభవార్త.. ఇకపై ఫ్రీ బస్ ప్రయాణం
X

దిశ, వెబ్‌డెస్క్: భక్తులకు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం యాజమాన్యం శుభవార్త తెలిపింది. ఇటీవల వైటీడీఏ కొండపైకి ప్రైవేటు వాహనాలు నిషేధించింది. ద్విచక్ర వాహనాలతో పాటు కారు, ప్రైవేటు బస్సులు ఇలా ఏ ఒక్క వాహనాన్ని కొండపైకి అనుమతించడం లేదు. దాంతో భక్తులు కొండపైకి చేరుకునేందుకు కష్టపడుతున్నారు. ఈ సందర్భంగా కొండ కింద నుంచి పైకి వచ్చేందుకు ఉచిత ఆర్‌టీసీ బస్ సర్వీస్‌ను ఏర్పాటు చేసినట్లు దేశస్థాన యాజమాన్యం తెలింది.

1-04-2022 నుంచి ఈ ప్రతి రోజూ ఈ సర్వీస్ భక్తులకు అందుబాటులోకి రానున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. అంతేకాకుండా కొండపైకి భక్తులు చేరేందుకు అయ్యే ఆర్‌టీసీ బస్సు చార్జీలను దేవస్థానమే భరిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగ పరుచుకుకోవాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ ఈ ప్రకటనను విస్తృత ప్రచారం చేయాలని వారు కోరారు.




Next Story

Most Viewed