పండుగపూట విషాదం.. సముద్రంలో నలుగురు యువకులు గల్లంతు

by Gantepaka Srikanth |

పండుగపూట నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఎర్రపగుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

పండుగపూట విషాదం.. సముద్రంలో నలుగురు యువకులు గల్లంతు
X

దిశ, వెబ్‌డెస్క్: పండుగపూట నెల్లూరు జిల్లా(Nellore District) అల్లూరు మండలం ఎర్రపగుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇసుకపల్లి దగ్గర సముద్రంలో నలుగురు యువకులు గల్లంతు అయ్యారు. విషయం తెలిసిన వెంటనే స్పాట్‌కు వచ్చిన పోలీసులు ఒకరి మృతదేహాన్ని వెలికి తీశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఈతకొట్టే క్రమంలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరగడంతో యువకులు గల్లంతయినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సెలవుల వేళ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని తల్లిదండ్రులకు స్థానిక పోలీసులు సూచనలు చేశారు. స్నేహితుల బలవంతం వల్ల ఈత రాకపోయినా చెరువులు, వాగులు, సముద్రంలోకి దిగే ప్రమాదం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Next Story