Breaking: ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

by Disha Web Desk 2 |
Breaking: ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా అన్ని రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. కాగా, ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయా రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సుమారు యాభై వేలమంది అధికారులు భద్రత కోసం మోహరించారు. ఎన్నికల సిబ్బందికి మాస్క్‌, కేంద్రాల శానిటైజేషన్‌, ఫేస్‌ షీల్డ్‌ తప్పనిసరి చేశారు. లక్షణాలను ఉన్నవాళ్లను కౌంటింగ్‌ హాల్‌లోకి అనుమతించలేదు.

Next Story

Most Viewed