మరోసారి పెద్ద మనసు చాటుకున్న మంత్రి పొంగులేటి.. ఖమ్మం రూరల్‌లో మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం!

by Jakkula.Mamatha |

రూరల్ మండలంలోని 21 గ్రామ పంచాయతీల పరిధిలో మే 1 నుంచి మే 31 వరకు మరణించిన బాధిత కుటుంబాలకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.

మరోసారి పెద్ద మనసు చాటుకున్న మంత్రి పొంగులేటి.. ఖమ్మం రూరల్‌లో మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం!
X

దిశ , ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలోని 21 గ్రామ పంచాయతీల పరిధిలో మే 1 నుంచి మే 31 వరకు మరణించిన బాధిత కుటుంబాలకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సహాయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు తోట వీరభద్రం ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న ఈ సహాయం బాధిత కుటుంబాలకు కొంత ఊరటనిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్లెం వెంకటరెడ్డి, మాజీ ఖమ్మం మార్కెట్ చైర్మన్ మద్ది మల్లారెడ్డి, జిల్లా నాయకుడు బండి జగదీష్ , మాజీ సర్పంచ్‌లు, ప్రస్తుత సర్పంచ్‌లు, మార్కెట్ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై బాధిత కుటుంబాలకు తమ సంఘీభావం తెలిపారు.

Next Story