- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు: ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది....

X
దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు(Former MP Raghu Rama Krishna Raju) కస్టోడియల్ టార్చర్ కేసు(Custodial torture case)లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంట్పై దాడి చేసిన వారికి ఎంపీని టార్చర్ చేసిన వారికి తేడా ఏంటి..? అని జడ్జి ప్రశ్నించారు. సునీల్ నాయక్ తక్షణం సరేండర్ కావాలని సూచించారు. ఎంపీపై దాడి ఆరోపణలు చాలా తీవ్రమైనవని, కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని వెల్లడించారు. సునీల్ ముందస్తు బెయిల్ విచారణ రేపటికి వాయిదా వేశారు.
Next Story






