- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర ప్రమాదం.. బస్సు బీభత్సానికి సిఆర్పిఎఫ్ జవాన్ సహా నలుగురు మృతి
వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బీభత్సానికి సిఆర్పిఎఫ్ జవాన్ సహా నలుగురు మృతి చెందారు.

దిశ, వెబ్ డెస్క్: వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బీభత్సానికి సిఆర్పిఎఫ్ జవాన్ సహా నలుగురు మృతి చెందారు. ఈ షాకింగ్ ఘటన జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై జఖానీ-చెనాని ప్రాంతంలో ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డోడా నుండి జమ్మూ వైపు వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘోరం జరిగినట్లు అధికారులు తెలిపారు.
అదుపు తప్పిన బస్సు తొలుత ఒక మోటార్ సైకిల్ను ఢీకొట్టి, ఆపై రహదారి పక్కనే ఆగి ఉన్న లోడ్ క్యారియర్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ లోడ్ క్యారియర్కు స్వల్ప సాంకేతిక లోపం తలెత్తడంతో ఒక మెకానిక్ దానిని రిపేర్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో బైక్ పైన ఉన్న జవాన్, లోడ్ క్యారియర్ డ్రైవర్, మెకానిక్ సహా నలుగురు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.






