ఎగ్జిట్ పోల్స్‌.. ఐదు కార్పొరేషన్లలో అధికార పార్టీదే పైచేయి

by Malleboina Mahesh |

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగించనుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికలు కావడంతో ప్రజల తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

ఎగ్జిట్ పోల్స్‌.. ఐదు కార్పొరేషన్లలో అధికార పార్టీదే పైచేయి
X

దిశ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగించనుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికలు కావడంతో ప్రజల తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో రెండింటిలో హస్తం పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించనుందని సర్వే సంస్థలు ప్రకటించాయి.

మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తరువాత బీఆర్‌ఎస్ నిలుస్తుందని, కార్పొరేషన్‌లలో మాత్రం బీజేపీ ముందుంటుందని తెలిపింది. బుధవారం పోలింగ్​అనంతరం రెండు సర్వే సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ను వెల్లడించాయి. రెండు కూడా ఐదు కార్పొరేషన్‌లలో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని ప్రకటించాయి. నిజామాబాద్, కరీంనగర్‌లో బీజేపీ ఆధిపత్యాన్ని ప్రదర్శించనుందని తెలిపాయి.

నిజామాబాద్‌లో ఎంఐఎం కీలకం..

పీపుల్స్​పల్స్ సంస్థ నిజామాబాద్ మినహా మిగిలిన వాటిల్లో కాంగ్రెస్ ఆధిక్యతను ప్రదర్శించనుందని తెలిపింది. కరీంనగర్‌లో మాత్రం ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాదని, అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా బీజేపీ నిలుస్తుందని వెల్లడించింది. మున్సిపాలిటీల్లో అత్యధికంగా కాంగ్రెస్​పార్టీ కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది.

అలాగే పల్స్ టుడే సంస్థ ఏడు కార్పొరేషన్‌లలో ఐదింటిని కాంగ్రెస్‌ కైవసం చేసుకోనుందని తెలిపింది. నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్‌లలో మాత్రం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించనుందని, ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని వెల్లడించింది. మరోవైపు కరీంనగర్‌లో బీజేపీ తర్వాత కాంగ్రెస్ రెండో స్థానం, నిజామాబాద్‌లో మాత్రం ఎంఐఎం రెండో స్థానంలో నిలుస్తుందని ఈ సర్వే ఫలితాలు తెలుపుతున్నాయి.

Next Story