- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కూతురి ఫిర్యాదుతో పూడ్చి పెట్టిన శవానికి పరీక్షలు
దిశ, పరిగి: పూడ్చి పెట్టిన శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేసిన ఘటన కుల్కచర్ల మండలం రాంపూర్లో చోటు చేసుకుంది. కుల్కచర్ల ఎస్ఐ గిరి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన జి. అనంతమ్మ(45)కు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు వృత్తి రీత్యా హైదరాబాద్లో ఉంటున్నాడు. కూతురు పెళ్లి చేసుకొని చిత్తూరులో ఉంటుంది. కాగా అనంతమ్మ ఈ నెల 10న మృతి చెందింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న కుమారుడు రాంపూర్ వచ్చి అంత్యక్రియలు నిర్వహించాడు. అనంతమ్మ కూతురు సోమవారం రాంపూర్కు చేరుకుంది. తన తల్లి అనంతమ్మ మృతి పట్ల అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తహశీల్దార్ రమేష్, వైద్యాధికారి మురళీకృష్ణ, సిబ్బంది ప్రవీణ్కుమార్ ల సమక్షంలో పూడ్చి పెట్టిన శవాన్ని సోమవారం వెలికితీసి శవ పరీక్షలు నిర్వహించారు. అనంతరం శవాన్ని పూడ్చి పెట్టారు.