- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సినిమాను ప్రతి ఒక్కరు చూడాలి: గీతా మూర్తి
by Satheesh |
దిశ, అంబర్ పేట్: ప్రముఖ సినీ దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి తెరకెక్కించిన- latest Telugu news

X
దిశ, అంబర్ పేట్: ప్రముఖ సినీ దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి తెరకెక్కించిన 'కాశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి అన్నారు. ప్రసాద్ లాబ్లో కాశ్మీర్ ఫైల్స్ సినిమాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజా సింగ్తో కలిసి చూసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 1990 సంవత్సరంలో కాశ్మీరీ పండితులను ఊచ కోత కోసిన యదార్థ సంఘటన ఇతివృత్తంగా దర్శకుడు సినిమాను రూపొందించారని పేర్కొన్నారు. కాశ్మీర్ను పాకిస్థాన్లో కలపడానికి చేసిన అనేక ఆకృత్యాలు.. ఉగ్రవాదులు చేసిన దాఖలాలు చాలా ఉన్నాయని అన్నారు. ప్రధాని మోదీ 370 ఆర్టికల్ను రద్దు చేసి కాశ్మీర్ను ఆకృత్యాల నుండి కాపాడారని కొనియాడారు. వాస్తవ విషయాలను ప్రజలకు సినిమా రూపంలో చూపించడం సంతోషంగా ఉందన్నారు.
Next Story






