- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : ఎల్బీ నగర్ ఎమ్మెల్యే
by Batti.Sumithra |
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు.

X
దిశ, వనస్థలిపురం : పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. నాగోల్, బండ్లగూడ ప్రాంతాలకు చెందిన ఐకాన్ వాకర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో 'ప్రకృతిని ప్రేమిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం' అనే సందేశంతో చేపడుతున్న కార్యక్రమానికి సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి సంరక్షిస్తే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజూ నడక అలవాటు చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకాన్ వాకర్స్ గ్రూప్ అధ్యక్షుడు చెరుకు ప్రశాంత్ గౌడ్, జనరల్ సెక్రటరీ రమేశ్ గౌడ్ ఇతర సభ్యులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు.
Next Story






