నీళ్లు పోసినా నిరుపయోగమే.. వర్షాకాలంలో చిగురించని మొక్కలు

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-11 14:17:50  IST  )

రహదారుల మధ్య డివైడర్‌లను ఏర్పాటు చేశారు.

నీళ్లు పోసినా నిరుపయోగమే.. వర్షాకాలంలో చిగురించని మొక్కలు
X

దిశ, నాచారం: రహదారుల మధ్య డివైడర్‌లను ఏర్పాటు చేశారు. సుందరీకరణలో భాగంగా మల్లాపూర్ నుంచి హబ్సిగూడ చౌరస్తా వరకు డివైడర్ మధ్యలో మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణను గుత్తేదారుకు అప్పగించారు. సదరు గుత్తేదారుడు చెరువుల్లోని నీళ్లు తీసుకొచ్చి ట్యాంకర్లతో చెట్లకు పోస్తున్నారు. చెరువుల్లో రసాయన వ్యర్థాలు ఉండడంతో డివైడర్ మధ్య ఏర్పాటు చేసిన మొక్కలు ఏపుగా పెరగకుండా.. చనిపోతున్నాయి.

వర్షాకాలంలో చిగురించని మొక్కలు..

ఎండాకాలంలో మొక్కలు ఎండిపోవడం సర్వ సాధారణం. కానీ వర్షాకాలంలో కూడా మొక్కలు చిగురించకుండా ఎండిపోతున్నాయి. దీని కారణం వ్యర్ధా రసాయనాలతో కూడిన నీళ్లు చెట్లకు పోయడమే కారణం. ఉన్నత అధికారులు స్పందించి.. మొక్కలు కాపాడాలని కోరుతున్నారు.

Next Story