మ్యాచ్ గెలిచినా..RCB పై ఆగని ట్రోల్స్

by Disha Web Desk 12 |
మ్యాచ్ గెలిచినా..RCB పై ఆగని ట్రోల్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2022 లో విరాట్ కోహ్లీ టీమ్ పై ట్రోల్స్ విపరీతంగా రన్ అవుతున్నాయి. 30 బుధవారం ఆర్సీబీ, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ లో కోహ్లీ టీమ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ టీమ్ తీసుకున్న DRS పై అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. అసలు ఎం జరిగిందంటే.. KKR నుంచి వరుణ్ చక్రవర్తి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మహ్మద్ సిరాజ్ వేసిన బంతి.. వరుణ్ చక్రవర్తి బ్యాట్ మధ్యలో తగిలింది. కానీ RCB మాత్రం LBW కోసం DRS తీసుకుంది. క్లియర్‌గా బ్యాట్‌కు బాలు తగిలినట్లు కనిపించినా కూడా RCB జట్టు రివ్యూ తీసుకోవడంతో దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయబడుతుంది.

ఈ ట్రోల్స్ అభిమానులు సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చారు.. "RCB ద్వారా దశాబ్దంలో అత్యుత్తమ సమీక్ష" అని ఒక అభిమాని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అలాగే.."సిరాజ్ DRS తీసుకోవడానికి ఎవరినైనా ఒప్పించగలడు" అని మరొకరు రాశారు. "ఆర్‌సిబి డిఆర్‌ఎస్‌ని ఉపయోగించడం అంటే నేను మా నాన్న డబ్బును ఉపయోగించడం లాంటిది" అని మరొక అభిమాని రాసాడు.


Next Story

Most Viewed