Record: తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇదే తొలిసారి

by Disha Web Desk 2 |
Record: తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇదే తొలిసారి
X

దిశ, వెబ్‌డెస్క్: వేసవి కాలం దృష్ట్యా తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఇవాళ(సోమవారం) సాయంత్రం 03 : 54 గంటలకు 13,857 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్ర ప్రజలు వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంత మొత్తంలో విద్యుత్ వినియోగం జరుగడం ఇదే మొదటిసారి అని విద్యుత్ అధికారులు వెల్లడించారు. మూడ్రోజుల క్రితం అత్యధికంగా 13,742 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగించుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పెరిగిన వ్యవసాయం, పరిశ్రమల స్థాపన, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతోనే విద్యుత్ డిమాండ్ పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. మరో రెండ్రోజుల్లోనే 14 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Next Story

Most Viewed