అదుపుతప్పి బోల్తా పడిన ఇసుక టిప్పర్.. డ్రైవర్ అక్కడికక్కడే మృతి

by Jakkula.Mamatha |

మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదన్ పల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ నరేష్(25) అక్కడికక్కడే మృతి చెందాడు.

అదుపుతప్పి బోల్తా పడిన ఇసుక టిప్పర్.. డ్రైవర్ అక్కడికక్కడే మృతి
X

దిశ, మక్తల్: మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదన్ పల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ నరేష్(25) అక్కడికక్కడే మృతి చెందాడు. నర్వ నుంచి జక్లేర్ వైపు ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నారాయణపేట మండలం శేర్నపల్లికి చెందిన డ్రైవర్ నరేష్ వాహనం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఆ కుటుంబానికి ఒక్కడే కొడుకు కావడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న మక్తల్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Next Story